Breaking News

కృష్ణమ్మ ఉగ్రరూపం

కృష్ణమ్మ ఉగ్రరూపం

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో భారీవర్షాలు కురుస్తున్నందున జూరాలకు ప్రస్తుతం ఐదులక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. క్రమేణా ఇది మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. బ్యాక్ వాటర్ వల్ల ఈ దిగువ సూచించిన గ్రామాలు ప్రభావితం కావచ్చు. అందువల్ల నదీ పరివాహక గ్రామ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శృతిఓఝా సూచించారు. ఇరిగేషన్, పంచాయతీ రాజ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకొవాలని ఆదేశించారు. అవసరమైన చోట లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీచేశారు.