![కియారా వెంట పడ్డ టాలీవుడ్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/KIARA-ADWANIIIFFF.jpg?fit=700%2C326&ssl=1)
కియారా అద్వానీ టాలీవుడ్లో రెండే సినిమాలు చేసినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులను ఎంతో మెప్పించింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ అగ్ర నిర్మాతలంతా కియారా జపం చేస్తున్నారట. సూపర్ స్టార్ మహేశ్బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రంలో చాలా క్యూట్గా కనిపించి ఆకర్షించిన ఈ అమ్మడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’లోనూ అదే తరహా పాత్రలో చేసింది. అయితే ‘వినయ విధేయ రామ’ చిత్రంలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యం దక్కలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో ఎంతో బిజీగా మారిపోయింది. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి. దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్తో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు. చరణ్ సరసన కియారాను తీసుకోవాలని కొరటాల గట్టిగా ప్రయత్నిస్తున్నాడట. మరో ముగ్గురు అగ్రనిర్మాతలు కూడా తమ కొత్తప్రాజెక్ట్లో కియారానే తీసుకోవాలని భావిస్తున్నారట.