Breaking News

కియారా.. ఎస్.. నో

సూపర్ స్టార్ మహేష్​ బాబు, డైరెక్టర్ పరుశరామ్ కాంబినేషన్ల ‘సర్కారు వారి పాట’ సినిమా తెరకెక్కడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. పరుశరామ్ చెప్పిన కథ నచ్చడంతో మహేష్ సినిమా ఓకే చేశారట. అధికారికంగా ప్రకటించినా ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ ముగియగానే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందట. అయితే ఇంకా హీరోయిన్ గా ఎవరు కన్​ఫామ్​ కాలేదట. అందుకోసం ‘భరత్ అను నేను’ ఫేమ్ కియారానే ఈ సినిమాలో కూడా తీసుకుంటే బాగుంటుందని టీమ్ అనుకుంటున్నారట. అంతేకాదు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారట. అయితే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఈ ప్రాజెక్టు​కు ఎస్ చెప్పాలా.. నో చెప్పాలా అనే సందిగ్ధంలో ఉందట. ఎందుకంటే కియారా అక్షర్ కుమార్ హీరోగా వస్తున్న ‘లక్ష్మీబాంబ్’, ‘ఇందూ కీ జవానీ’, ‘భూల్ భూలయ్య 2’లో నటిస్తోంది. ఫుల్ టైట్ షెడ్యూల్ ఉన్నా ఈ సినిమాను వదులుకోవడం అస్సలు ఇష్టం లేదట కియారాకు. ఆల్ ​రెడీ మహేష్​తో ఒకసారి నటించింది కావునా నో చెప్పదనే కాన్ఫిడెన్స్​తో ఉన్నారట టీమ్. ఏం జరుగుతుందో చూద్దాం మరి.