Breaking News

కానిస్టేబుల్​కు వీడ్కోలు

కానిస్టేబుల్​ను సన్మానిస్తున్న పోలీసులు

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాంత్ కు బదిలీ కావటంతో స్టేషన్ ఆవరణలో అతడికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్​ను పోలీస్​సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై అనూష మాట్లాడుతూ, శ్రీకాంత్​ విధి నిర్వహణలో సమర్థంగా పనిచేసేవాడని చెప్పారు. కీలకమైన కేసుల్లో చాకచక్యంగా వ్యవహరించాడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.