Breaking News

కాంగ్రెస్​ నేత వీహెచ్​కు కరోనా

హైదరాబాద్‌ : కాంగ్రెస్ సీనియర్​ నేత, మాజీ ఎంపీ వీహెచ్​ (హనుమతంతరావు)కు కరోనా సోకింది. రెండ్రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ దవాఖానలో ఆయనకు చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబసభ్యులంతా హోం క్వారంటైన్​ ఉన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇటీవలే వందమందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఆ రోజు నుంచే వీహెచ్​ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. లాక్​డౌన్​లోనూ ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జూనియర్‌ డాక్టర్ల సమ్మెకు మద్దతుగా గాంధీ ఆసుపత్రికి వెళ్లినప్పుడు కరోనా సోకి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. మరోవైపు వీహెచ్​ను ఇటీవల కలిసిన కాంగ్రెస్ నేతల్లో భయం నెలకొన్నది. ​