Breaking News

కాంగ్రెస్​ ఎమ్మెల్యేల అంత్యాక్షరి

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయాలు రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. సీఎం అశోక్​ గెహ్లాట్​ మాజీ డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సచిన్​ పైలట్​కు అనుకూలంగా ఉన్న 19 మంది ఎమ్మెల్యేలపై ఇప్పటికే కాంగ్రెస్​ అధిష్ఠానం వేటు వేసింది. మరోవైపు అశోక్​గెహ్లాట్​కు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్​ జైపూర్​లోని ఫెయిర్​మౌంట్​లో ఉంచింది. ఈ క్రమంలో ఆదివారం సరదాగా కొందరు ఎమ్మెల్యేలు అంత్యాక్షరి ఆడుతూ కనిపించారు. మరికొందరు తంబోలా ఆడుతూ, టీవీ చూస్తూ కాలక్షేమపం చేస్తున్నారు. మెజార్టీ వర్గం తమదేనని, తాము 100 కంటే ఎక్కువ మంది ప్రజాప్రతినిధులమని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర గుడా అన్నారు.