Breaking News

కలెక్టర్​ ఆకస్మిక పర్యటన.. షాకింగ్​ నిజాలు

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ కలెక్టర్​ ఆకస్మిక పర్యటనతో షాకింగ్​ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో సిబ్బంది ఎవరూ సమయానికి ఆఫీస్​కు రారని.. ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని కలెక్టర్​ పర్యటనలో తేలింది. కొత్త కలెక్టర్​ శర్మన్​ విధుల్లో చేరినప్పటినుంచి బిజీబిజీగా గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు ఆకస్మికపర్యటనలు చేస్తూ.. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. తాజాగా గురువారం ఆయన నాగర్​కర్నూల్​లో కాలినడకన తిరిగి పలు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఉదయం 10:15 గంటలకు  డీఆర్వో మధుసూదన్ నాయక్ తో కలిసి కలెక్టర్ క్యాంపు ఆఫీస్​ నుంచి బయలుదేరారు. ఆర్డీవో కార్యాలయం, జెడ్పీ కార్యాలయం, ఎంపీడీవో, డీఈవో, ఎంఈవో, మహిళా సమాఖ్య భవనం, భవిత కేంద్ర కార్యాలయాలను సముదాయంలోని పలు శాఖల కార్యాలయాలను తనిఖీ చేశారు. కార్యాలయాల్లో సిబ్బంది ఎవరూ లేకపోవడంపై కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోతే ఉపేక్షించబోమని హెచ్చరించారు,