Breaking News

కరోనా.. మజాకా

కరోనా.. మజాకా

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. ఒకరి నుంచి మరొకరిని చుట్టేస్తోంది. శుక్రవారం తాజాగా తెలంగాణలో కొత్తగా 1,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం సంచలనం రేపుతోంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్​కేసుల సంఖ్య 20,462కు చేరింది. తాజాగా 8 మంది చనిపోయారు. ఇలా ఇప్పటి వరకు 283 మంది మృత్యువాతపడ్డారు. 10,195 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 9,984 కు చేరింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే..జీహెచ్​ఎంసీ పరిధిలో 1,658, రంగారెడ్డి జిల్లాలో 56, మేడ్చల్​44, సంగారెడ్డి జిల్లాలో 20, వరంగల్​రూరల్​జిల్లాలో 41 చొప్పున కేసులు నమోదయ్యాయి.