Breaking News

కరోనా నియంత్రణలో ఫెయిల్​

సారథిన్యూస్, రామడుగు: కరోనాను అరికట్టడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్​ పార్టీ ఎస్సీ సెల్​ రాష్ట్ర కన్వీనర్​ వెన్న రాజమల్లయ్య ఆరోపించారు. మంగళవారం కరీంనగర్​ జిల్లా రామడుగులో ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్ల్యూహెచ్ వో సూచనలు పాటించకపోవడంతోనే అధిక మరణాలు సంభవిస్తున్నాయనన్నారు. చావుకు ఎదురు నిలిచిన డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పాత్రికేయులకు, కనీస సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయం అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు.