![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/CONGGGGGGGF.jpg?fit=1280%2C720&ssl=1)
సారథిన్యూస్, రామడుగు: కరోనాను అరికట్టడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్న రాజమల్లయ్య ఆరోపించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా రామడుగులో ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్ల్యూహెచ్ వో సూచనలు పాటించకపోవడంతోనే అధిక మరణాలు సంభవిస్తున్నాయనన్నారు. చావుకు ఎదురు నిలిచిన డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పాత్రికేయులకు, కనీస సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయం అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు.