Breaking News

కరోనా.. అంతకంతకు

కరోనా.. అంతకంతకు

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది.. కొత్త వ్యక్తులకు అంటుకుంటోంది. శుక్రవారం 4,374 మందిని పరీక్షించగా 985 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఇప్పటి వరకు మొత్తంగా 12,349 పాజిటివ్ ​కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా వ్యాధిబారిన పడి ఏడుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు 237 మంది చనిపోయారు. యాక్టివ్​ కేసులు 7,436 ఉన్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 774 కేసులు నమోదు కావడం భయాందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 86 కేసులు, మేడ్చల్ జిల్లాలో 53, వరంగల్​అర్బన్​జిల్లాలో 20 పాజిటివ్​ కేసుల చొప్పున నమోదయ్యాయి.