Breaking News

కరోనాపై ఇంత నిర్లక్ష్యమా

కరోనాపై ఇంత నిర్లక్ష్యమా

సారథిన్యూస్, రామడుగు: కరోనాను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్​ బీసీసెల్​ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్​ విమర్శించారు. కరీంనగర్​ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నదని ఆరోపించారు. సోమవారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో కరోనా వ్యాప్తికి బాధ్యత వహిస్తూ మంత్రులు ఈటల రాజేందర్​, గంగుల కమాలాకర్​, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. ఓ యువనేత పుట్టినరోజు వేడుకలంటూ వందలమంది కార్యకర్తలు ఒకే చోట గుమిగూడి కరోనాను వ్యాపింపజేశారని ఆరోపించారు.