Breaking News

కరోనాతో సీపీఎం నేత షడ్రక్​ మృతి

కరోనాతో సీపీఎం నేత షడ్రక్​మృతి

సారథి న్యూస్, కర్నూలు: సీపీఎం సీనియర్ నేత, పార్టీ కర్నూలు జిల్లా కమిటీ సభ్యుడు టి.షడ్రక్(62)​మంగళవారం కరోనాతో తనువు చాలించారు. కొద్దిరోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండగా హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ప్రాణం విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్​ఖాన్ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటని జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్​రెడ్డి అన్నారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వి.రామాంజనేయులు, గౌస్ దేశాయ్ పి.నిర్మల, పీఎస్ రాధాకృష్ణ, కె.వెంకటేశ్వర్లు నివాళులర్పించారు.