Breaking News

కరోనాతో సింగరేణి కార్మికుడి మృతి

సింగరేణిలో విధుల బహిష్కరణ

సారథి న్యూస్​, గోదావరిఖని: సింగరేణిలో పనిచేస్తున్న ఓ కార్మికుడు కరోనా లక్షణాలతో మృతిచెందాడు. దీంతో గురువారం సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికులు విధులను బహిష్కరించారు. సింగరేణిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాజమాన్యం వెంటనే లాక్​డౌన్​ ప్రకటించాలని సింగరేణి ఎంప్లాయీస్​ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారయ్య, గని కార్యదర్శి కే రంగారావు కోరారు. సింగరేణి ఆర్జీవన్​ డివిజన్​లోని జీడీకే రెండవ గనిలో పనిచేస్తున్న టామర్​ కార్మికుడు బుధవారం కరోనా లక్షణాలతో మృతిచెందాడు. దీంతో కార్మికవర్గం ఒక్కటైంది.