Breaking News

కరోనాతో సర్పంచ్ మృతి

సారథి న్యూస్, రామడుగు: కరోనా మహమ్మారి ఓ సర్పంచ్​ను బలితీసుకుంది. తమతో కలిసి తిరిగిన వ్యక్తి.. తమ బాగోగులు పట్టించుకున్న నేత ఇక లేడన్న వార్త ఆ ఊర్లో విషాదం నింపింది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం పందికుంటపల్లి సర్పంచ్​, మండల సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు కటకం రవీందర్​ గురువారం కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా సోకింది. దీంతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​లో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రవీందర్​ ఏకగ్రీవంగా సర్పంచ్​గా ఎన్నికయ్యారు. గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలందరినీ నిత్యం పేరుపేరునా పలకరించేవారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. గురువారం ఆయన వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​, టీఆర్​ఎస్​ నేతలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయన మృతికి సంతాపం తెలిపారు.