Breaking News

ఒక ఎన్​కౌంటర్​ ఎన్నోప్రశ్నలు

కాన్పూర్​: కరడుగట్టిన గ్యాంగ్​స్టర్​ వికాస్​ దూబే ఎన్​కౌంటర్​పై ప్రస్తుతం సోషల్​మీడియాలో ప్రశ్నల వర్షం మొదలైంది. శుక్రవారం ఉదయం కాన్పూర్​ సమీపంలో పోలీసుల ఎన్​కౌంటర్​లో వికాస్​దూబే మరణించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం పలు నాటకీయపరిణామాల మధ్య ఉజ్జయినిలో వికాస్​దూబే అరెస్టయ్యారు. అరెస్ట్​కు కొద్దిగంటల ముందే వికాస్​దూబేకు సన్నిహితులైన ఇద్దరు అనుచరులను పోలీసులు ఎన్​కౌంటర్​లో కాల్చిచంపారు పోలీసులు. కాగా వికాస్​దూబే ఎన్​కౌంటర్​పై చాలా మంది ప్రశంసిస్తూ సోషల్​మీడియాలో పోస్టులు పెడుతుండగా.. మరికొందరు మాత్రం ఎన్​కౌంటర్​పై పోలీసులు చెబుతున్న వివరణ చాలా ఫన్నీగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. వికాస్​దూబేను తీసుకొచ్చిన వాహనం.. పోలీసుల బోల్తాపడిందని చూపుతున్న వాహనం ఒకటి కాదంటూ కొందరు నెట్​జన్లు సోషల్​మీడియాలో పోస్టులు పెడుతున్నారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్​ యాదవ్​ కూడా వికాస్​ దూబే ఎన్​కౌంటర్​ను తప్పుబడుతూ ట్వీట్​చేశారు. మరోవైపు వికాస్​దూబే సొంతగ్రామం బిక్రూలో ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. పోలీసులను వికాస్​దూబే అనుచరులు చంపితే యూపీలో రౌడీరాజ్యం నడుస్తోందని.. చేతకానీ సీఎం ఉన్నారని వ్యాఖ్యానించిన కొందరు నేతలు.. ఇప్పడు ఇలా మాట్లాడం ఏమిటని బీజేపీ నేతలు ప్రశ్నస్తున్నారు.