Breaking News

ఒకేరోజు 10,093 కేసులు

ఒకేరోజు 10,093 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో బుధవారం 10,093 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,20,390 కు చేరింది. తాజాగా కరోనాతో 65 మంది మృతి చెందారు. మొత్తంగా 1,213 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 63,771 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 2,784 మంది ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 55,406 ఉంది. ఇక మహమ్మారి బారినపడిన వారి సంఖ్యను జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 1371, చిత్తూరు 819, ఈస్ట్​గోదావరి 1676, గుంటూరు 1124, కడప 734, కృష్ణా 259, కర్నూలు 1091, నెల్లూరు 6‌08, ప్రకాశం 242, శ్రీకాకుళం 496, విశాఖపట్నం 841, విజయనగరం 53, వెస్ట్​గోదావరి 779 చొప్పున కేసులు నమోదయ్యాయి.