Breaking News

ఏపీ ఎమ్మెల్యేకు కరోనా

సారథిన్యూస్​, విజయనగరం: దేశవ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు కరోనా వైరస్​ సోకుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్​ విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా సోకింది. గత రెండురోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఓ డిప్యూటీ తహసీల్దార్​కు కరోనా సోకినట్టు సమాచారం.