Breaking News

ఏపీలో 7,895 కరోనా కేసులు

ఏపీలో 7,895 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో ఆదివారం 7,895 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,53,111కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 93 మంది మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,282 మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89,742 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 46,712 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 32,38,038 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వ్యాధిబారి నుంచి తాజాగా 7,449 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 2,60,087 మంది కోలుకుని ఇళ్లకు చేరారు.

ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​

ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 466, చిత్తూరు 934, ఈస్ట్​గోదావరి 1,256, గుంటూరు 507, కడప 448, కృష్ణా 142, కర్నూలు 685, నెల్లూరు 985, ప్రకాశం 923, శ్రీకాకుళం 227, విశాఖపట్నం 451, విజయనగరం 200, వెస్ట్​గోదావరి జిల్లాలో 671 చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ ​బులెటిన్​ను విడుదల చేసింది.