Breaking News

ఏపీలో 10,603 కరోనా కేసులు

ఏపీలో 10,603 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో ఆదివారం(24 గంటల్లో) కొత్తగా 10,603 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,24,767కు చేరింది. తాజాగా, 88 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,884కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 99,129 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 63,077 శాంపిళ్లను పరీక్షించారు. అలాగే 9,067 మంది కరోనా రోగులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు కోలుకున్న రోగుల సంఖ్య 3,21,754కు చేరింది.

ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​

జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 695, చిత్తూరు 948, ఈస్ట్​గోదావరి 1090, గుంటూరు 593, కడప 952, కృష్ణా 383, కర్నూలు 811, నెల్లూరు 1028, ప్రకాశం 881, శ్రీకాకుళం 819, విశాఖపట్నం 866, విజయనగరం 558, వెస్ట్​గోదావరి 979 చొప్పున పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.