Breaking News

ఏపీలో 10,526 పాజిటివ్‌ కేసులు

ఏపీలో 10,526 పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో శుక్రవారం(24 గంటల్లో) 10,526 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 4,00,721కు చేరింది. తాజాగా, వైరస్‌ బారినపడి 81మంది మృతిచెందారు. ఇప్పటివరకు 3,714 మంది మృత్యువాత పడ్డారు. 24 గంటల్లో 8,463 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,711కు చేరింది. తాజాగా 61,331 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తంగా 35,41,321 మెడికల్​టెస్టులు చేశారు. ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుతం 96,191 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఏపీ వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​

జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 833, చిత్తూరు 819, ఈస్ట్​గోదావరి 1,178, గుంటూరు 801, కడప 501, కృష్ణా 414, కర్నూలు 757, నెల్లూరు 1,151, ప్రకాశం 874, శ్రీకాకుళం 764, విశాఖపట్నం 896, విజయనగరం 552, వెస్ట్​గోదావరి 986 చొప్పున పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్​వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేశారు.