Breaking News

ఎమ్మెల్యే పెళ్లి.. రచ్చ రచ్చ

తమిళనాడుకు చెందిన కళ్లకురిచచి ఎమ్మెల్యే ప్రభు(34) ప్రేమ వివాహం రచ్చ రచ్చగా మారింది. ఎమ్మెల్యే ప్రభు.. సౌందర్య అనే బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి సౌందర్య తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అర్చకుడిగా పనిచేస్తున్న ఆయన తన కూతురు ఎమ్మెల్యే కిడ్నాప్​ చేశాడని.. ఆమె ఇంకా మైనర్​ అంటూ మద్రాస్‌ హై కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ కేసుపై బుధవారం కోర్లు విచారించనున్నది. ఇప్పటికే సౌందర్య పోలీసుల వద్దకు వచ్చి తనను ఎవరూ కిడ్నాప్​ చేయలేదని.. ఇష్టపూర్తిగానే పెళ్లి చేసుకున్నానని చెప్పినట్టు సమాచారం. ‘మేం నాలుగు నెలలుగా ప్రేమించుకుంటున్నాం. నేను తనను కిడ్నాప్‌ చేశాననే మాట అవాస్తవం. వివాహం అయ్యాక మేం సౌందర్య తల్లిదండ్రుల ఆశీస్సుల కోసం వారి ఇంటికి వెళ్లాం. కానీ వారు మమ్మల్ని తిరస్కరించారు. ఈ పెళ్లికి మా తల్లిదండ్రుల అనుమతి ఉంది’ అని ఎమ్మెల్యే ప్రభుత తెలిపారు.