![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/TRS-RAMAGUNDAMMMFF.jpg?fit=729%2C334&ssl=1)
సారథిన్యూస్, గోదావరిఖని: కుట్రపూరితంగానే కాంగ్రెస్ నాయకులు హైకోర్టుకు వెళ్లి రామగుండం నగరపాలక సంస్థ కో ఆప్షన్ ఎన్నికను వాయిదా వేయించారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మంగళవారం టీఆర్ఎస్ నాయకులు పాతపల్లి ఎల్లయ్య, తోడేటి శంకర్ గౌడ్ రామగుండం ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో టీఆర్ఎస్కు 39 మంది కార్పొరేటర్లు ఉండగా కాంగ్రెస్కు 11 మంది మాత్రమే ఉన్నారు. కార్పొరేటర్ల మెజార్టీతో టీఆర్ఎస్కు చెందిన వ్యక్తి కో-ఆప్షన్ సభ్యుడిగా ఎన్నికవుతారని చెప్పారు. దీంతో కాంగ్రెస్ నేతలు కుట్రపూరితంగానే కోర్టుకు వెళ్లారని ఆరోపించారు. మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నేతలు సీహెచ్ మొగిలి, నారాయణ దాస్ మారుతి, దీటీ బాలరాజు, బొడ్డు రవీందర్, వెతుకు దేవరాజు, అచ్చ వేణు, నూతి తిరుపతి, ఖాజా సిరొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.