Breaking News

ఎదురులేని ‘ముంబై’

ఎదురులేని ‘ముంబై’

అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్‌ను ముంబై ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. రోహిత్‌ శర్మ(5) విఫలమైనా క్వింటాన్‌ డీకాక్‌ 53(36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూర్యకుమార్‌ యాదవ్‌ 53(32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి ఇన్నింగ్స్​ను నిలబెట్టాడు. ఇషాన్‌ కిషన్‌(24), పొలార్డ్‌(15), కృనాల్​(12) ఆకట్టుకున్నారు.ముంబై ఇండియన్స్​ బౌలర్లు బౌల్ట్​ ఒక వికెట్​ తీయగా, కేహెచ్ పాండ్యా రెండు వికెట్ల చొప్పున తీశాడు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 42(33 బంతుల్లో 5 ఫోర్లు), శిఖర్‌ ధావన్‌ 69 (52 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌) పరుగులతో రాణించాడు. ఆదిలోనే పృథ్వీ షా(4) వికెట్‌ను కోల్పోయింది. రహానే మూడు ఫోర్లతో 15 పరుగులు చేశాడు. స్టోయినిస్‌(13) ఎ‍క్కువ సేపూ క్రీజ్‌లో నిలవలేదు. అలెక్స్‌ క్యారీ( 14నాటౌట్​) ఫర్వాలేదనిపించాడు. ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో కృనాల్‌ పాండ్యా రెండు వికెట్లు సాధించగా, ట్రెంట్‌ బౌల్ట్‌కు వికెట్‌ దక్కింది.