అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్ను ముంబై ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. రోహిత్ శర్మ(5) విఫలమైనా క్వింటాన్ డీకాక్ 53(36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) సూర్యకుమార్ యాదవ్ 53(32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. ఇషాన్ కిషన్(24), పొలార్డ్(15), కృనాల్(12) ఆకట్టుకున్నారు.ముంబై ఇండియన్స్ బౌలర్లు బౌల్ట్ ఒక వికెట్ తీయగా, కేహెచ్ పాండ్యా రెండు వికెట్ల చొప్పున తీశాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 42(33 బంతుల్లో 5 ఫోర్లు), శిఖర్ ధావన్ 69 (52 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్) పరుగులతో రాణించాడు. ఆదిలోనే పృథ్వీ షా(4) వికెట్ను కోల్పోయింది. రహానే మూడు ఫోర్లతో 15 పరుగులు చేశాడు. స్టోయినిస్(13) ఎక్కువ సేపూ క్రీజ్లో నిలవలేదు. అలెక్స్ క్యారీ( 14నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు సాధించగా, ట్రెంట్ బౌల్ట్కు వికెట్ దక్కింది.