Breaking News

ఉద్యోగం రాలేదని..

సారథిన్యూస్, రామడుగు: ఎన్ని సార్లు ప్రయత్నించినా ఉద్యోగం రావటం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన మడ్డి లచ్చయ్యకు ముగ్గురు కుమారులు, ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటంతో, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్న కుమారుడు పవన్​కల్యాణ్​ (23) ఇటీవల ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఉద్యోగం రాకపోవడంతో ఇంట్లోని దూలానికి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అనూష తెలిపారు.