![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/MPS-SUSPENDFF.jpg?fit=700%2C389&ssl=1)
ఢిల్లీ: తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ నిన్న రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదించిన సంగతి చెలరేగింది. బిల్లు చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో చైర్మన్ పోడియం దగ్గరకు వెళ్లి పెద్దపెట్టు నినాదాలు చేశారు. కాగా సభలో అనుచితంగా ప్రవర్తించిన ఎనిమిది మంది ఎంపీలపై సోమవారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ వేటు వేశారు. వారంపాటు వీరిని సభనుంచి బహిష్కరించారు. సోమవారం సభ ప్రారంభంకాగానే మంత్రి ప్రహ్లద్జోషి సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా చైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోదించారు. మరోవైపు సస్పెన్షన్ను ఎంపీలు వ్యతిరేకించారు. ‘ ఇదేం ప్రజాస్వామ్యం’ అంటూ నినాదాలు చేశారు. వివేక్ ఓబ్రెయిన్, నాసిర్ హుస్సేన్, సంజయ్సింగ్, రుపిన్ బోరా, డోలాసేన్, రాజీవ్ వాస్తవ్, కేకే రాజేశ్, కరీమ్లు పై సస్పెన్షన్ వేటు పడింది.