![ఇంటర్ మెమోలు వచ్చేశాయి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/INTERMEDIATE-GIRLSFF.jpg?fit=700%2C350&ssl=1)
సారథిన్యూస్, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు ఫెయిల్ అయిన విద్యార్థులకు కనీస పాస్మార్కులు (35 శాతం) వేసి కంపార్ట్మెంటల్లో పాస్చేసింది. విద్యార్థులందరినీ పాస్చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,50,941 మంది విద్యార్థులను పాస్చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి శుక్రవారం ప్రకటించారు. విద్యార్థులు ఈ నెల 31వ తేదీ (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ tsbie.cgg.gov.in నుంచి మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు.