Breaking News

ఇంటర్​​ మెమోలు వచ్చేశాయి

ఇంటర్​ మెమోలు వచ్చేశాయి

సారథిన్యూస్​, హైదరాబాద్​: కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్​ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్​ బోర్డు ఫెయిల్​ అయిన విద్యార్థులకు కనీస పాస్​మార్కులు (35 శాతం) వేసి కంపార్ట్​మెంటల్​లో పాస్​చేసింది. విద్యార్థులందరినీ పాస్​చేస్తామని సీఎం కేసీఆర్​ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,50,941 మంది విద్యార్థులను పాస్​చేసినట్టు ఇంటర్​ బోర్డు కార్యదర్శి శుక్రవారం ప్రకటించారు. విద్యార్థులు ఈ నెల 31వ తేదీ (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇంటర్మీడియట్​ బోర్డు వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.in నుంచి మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించారు.