Breaking News

ఇంగ్లండ్​కు పాక్ జట్టు

కరాచీ: కరోనా పాజిటివ్ వచ్చిన పది మంది క్రికెటర్లను పక్కనబెట్టి.. మిగతా ఆటగాళ్లతో పాకిస్థాన్ జట్టు.. ఇంగ్లండ్లోని మాంచెస్టర్​కు చేరుకుంది. 20 మంది ఆటగాళ్లతో పాటు 11 మంది సహాయక సిబ్బంది ఈ బృందంలో ఉన్నారు.14 రోజుల క్వారంటైన్ తర్వాత వామప్ మ్యాచ్​లో బరిలోకి దిగనుంది. ‘మరో చారిత్రాత్మక పర్యటనకు వెళ్తున్నాం. ఇంగ్లండ్​లో ఆడటం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది’ అని బాబర్ ఆజమ్ ట్వీట్ చేశాడు. సహచరులతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోను ఉంచాడు. మూడు టెస్టులు, మూడు టీ20ల సీరిస్​ను పూర్తిగా బయో సెక్యూర్ వాతావరణంతో పాటు, ఖాళీ స్టేడియాల్లో నిర్వహించేందుకు ఇంగ్లండ్ బోర్డు సన్నాహలు చేస్తున్నది. పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లు పూర్తిగా కోలుకున్న తర్వాత జట్టుతో కలుస్తారని పీసీబీ వెల్లడించింది.