Breaking News

ఆన్​లైన్​ క్లాసుల పేరిట దోపిడీ

సారథి న్యూస్, చొప్పదండి: ప్రైవేట్​ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ పట్టణ ఉపాధ్యక్షుడు అనుమల్ల కోటేశ్ డిమాండ్​ చేశారు. ప్రైవేట్​, కార్పొరేట్​ విద్యాసంస్థలు కరోనా సాకుతో ఆన్​లైన్​ క్లాసులంటూ లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. బుధవారం కరీంనగర్​ జిల్లా చొప్పదండిలోని శక్తిభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనా సమయంలో అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలన్నారు. చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సంతోష్, సాయి గణేష్, లక్ష్మీపతి, అఖిల్, సాయి తదితరులు పాల్గొన్నారు.