సారథి న్యూస్, రామడుగు: ‘చావు సమస్యకు పరిష్కారం కాదు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. డిప్రెషన్కు గురైనప్పుడు దగ్గరి వాళ్లతో మాట్లాడాలి. మనం జీవితంలో సాధించిన విజయాలను స్మరించుకోవాలి. అంతేకానీ చనిపోతే ఏ ప్రయోజనం ఉండదు. కొత్తజీవితాన్ని ప్రారంభించాలి. కొత్తగా ఆలోచించాలి. కొత్త దారిలో పయనించాలి. అప్పడే విజయం మన పాదలచెంతకు చేరుతుంది’ అని ప్రముఖ సైకాలజిస్ట్, తెలంగాణ సైకాలజిస్ట్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం సూచించారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన ఆన్లైన్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన పలు సూచనలు చేశారు. ప్రపంచంలో ప్రతి 40 సెకండ్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని.. ఇది ఆందోళనకరమైన విషయమని చెప్పారు. ఈ ఆన్లైన్ సమావేశంలో జిల్లా కార్యదర్శి శివకుమార్, కోశాధికారి రేష్మ తదితరులు పాల్గొన్నారు.
- September 10, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- COUNCLING
- HYDERABAD
- KARIMNAGAR
- SUCIDE
- కరీంనగర్
- కౌన్సెలింగ్
- హైదరాబాద్
- Comments Off on ఆత్మహత్యలను ఆపుదాం!