Breaking News

‘ఆచార్య’ కథ నాది.. కాదు మాదే

మెగాస్టార్​ చిరంజీవి హీరోగా.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ చిత్ర కథపై ప్రస్తుతం వివాదం నెలకొంది. ఈ కథ తనదేనంటూ తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన రాజేశ్​ మండూరి అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ అంశం హాట్​ టాపిక్​గా మారింది. ఈ విషయంపై సోషల్​మీడియాతోపాటు.. మెయిన్​ స్ట్రీమ్​ మీడియాలోనూ జోరుగా చర్చ జరుగుతున్నది. తన కథను కొరటాల శివ కాపీ కొట్టి ఆచార్యగా తెరకెక్కిస్తున్నారని రాజేశ్​ ఆరోపించారు. ‘ నేను బీ గోపాల్​ దగ్గర అసిస్టెంట్​ డైరెక్టర్​గా పనిచేస్తున్నప్పడు ఈ కథను సిద్ధం చేసుకున్నాను. మైత్రీ మూవీ మేకర్స్​ సంస్థకు కథను వినిపించాను. వారు ఈ కథను రికార్డు చేసుకున్నారు. వాళ్లే ఈ స్టోరీని కొరటాలకు చేరవేసి ఉంటారు. నేను ఈ కథను బాలకృష్ణతో తెరకెక్కించేందుకు ప్లాన్​ చేసుకున్నాను. ప్రస్తుతం నా కథను కొట్టేసి నన్ను రోడ్డున పడేశారు. దీనిపై నేను న్యాయపోరాటం ’ అంటూ రాజేశ్​ ఆరోపించారు.

తప్పడు ఆరోపణలు

కాగా ఈ వివాదంపై మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్​ స్పందించింది. ఈ కథ మేము ఎక్కడా కాపీ కొట్టలేదని.. ఇది సొంతంగా కొరటాల శివ రాసుకున్న కథ అని వారు స్పష్టం చేశారు. ఇటీవల మేము విడుదల చేసిన ‘ఆచార్య’ మోషన్​ పోస్టర్​కు వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేక కొందరు పనిగట్టుకొని ఆరోపణలు చేస్తున్నారని చిత్ర నిర్మాణసంస్థ స్పష్టం చేసింది.