మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ చిత్ర కథపై ప్రస్తుతం వివాదం నెలకొంది. ఈ కథ తనదేనంటూ తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన రాజేశ్ మండూరి అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ఈ విషయంపై సోషల్మీడియాతోపాటు.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ జోరుగా చర్చ జరుగుతున్నది. తన కథను కొరటాల శివ కాపీ కొట్టి ఆచార్యగా తెరకెక్కిస్తున్నారని రాజేశ్ ఆరోపించారు. ‘ నేను బీ గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పడు ఈ కథను సిద్ధం చేసుకున్నాను. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు కథను వినిపించాను. వారు ఈ కథను రికార్డు చేసుకున్నారు. వాళ్లే ఈ స్టోరీని కొరటాలకు చేరవేసి ఉంటారు. నేను ఈ కథను బాలకృష్ణతో తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకున్నాను. ప్రస్తుతం నా కథను కొట్టేసి నన్ను రోడ్డున పడేశారు. దీనిపై నేను న్యాయపోరాటం ’ అంటూ రాజేశ్ ఆరోపించారు.
తప్పడు ఆరోపణలు
కాగా ఈ వివాదంపై మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ స్పందించింది. ఈ కథ మేము ఎక్కడా కాపీ కొట్టలేదని.. ఇది సొంతంగా కొరటాల శివ రాసుకున్న కథ అని వారు స్పష్టం చేశారు. ఇటీవల మేము విడుదల చేసిన ‘ఆచార్య’ మోషన్ పోస్టర్కు వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేక కొందరు పనిగట్టుకొని ఆరోపణలు చేస్తున్నారని చిత్ర నిర్మాణసంస్థ స్పష్టం చేసింది.