Breaking News

ఆగస్టు 3న స్కూల్స్​ ఓపెనింగ్​

ఆగస్టు 3న స్కూల్స్​ ఓపెనింగ్​
  • ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ నిర్ణయం
  • ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్​ ఆదేశాలు

సారథి న్యూస్, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త అందించింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా మూతపడ్డ స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 3న రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను పునఃప్రారంభించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ‘నాడు..నేడు’ కార్యక్రమంపై సమీక్షంలో భాగంగా స్కూళ్ల అభివృద్ధిపై సీఎం ఆరాతీశారు. జులై నెలారులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో ‘నాడు..నేడు’ కింద చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తిచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రతి స్కూలులో 9 రకాల సదుపాయాలు కల్పించాలని సూచించారు. దీనికి సంబంధించి రూ.456 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ కూడా రిలీజ్​ చేశామన్నారు. పనులను కంప్లీట్​ చేసేలా ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిరోజు సమీక్ష చేయాలని సూచించారు. మరోవైపు స్కూళ్ల అభివృద్ధి పనులకు సిమెంట్​, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.