Breaking News

ఆంధ్రప్రదేశ్​లో 8,943 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో 8,943 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో శుక్రవారం 8,943 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,70,190 కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 97 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 2,475కు చేరింది. వ్యాధి నుంచి కోలుకుని తాజాగా 9,779 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు వ్యాధి నయం అయినవారు 1,80,703 మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89,907 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 27,58,485 కరోనా పరీక్షలు చేశారు.

ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 762, చిత్తూరు 987, ఈస్ట్​గోదావరి 1,146, గుంటూరు 527, కడప 530, కృష్ణా 338, కర్నూలు 956, నెల్లూరు 669, ప్రకాశం 300, శ్రీకాకుళం 547, విశాఖపట్నం 885, విజయనగరం 548, వెస్ట్​గోదావరి 748 చొప్పున కేసులు కరోనా పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.