Breaking News

ఆంధ్రప్రదేశ్​లో 8,732 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో 8,732 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో ఆదివారం కొత్తగా 8,732 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,81,817కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 87 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 2,650కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 88,138 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. 1,91,117 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ ​అయ్యారు.

ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 580, చిత్తూరు 981, ఈస్ట్ ​గోదావరి 875, గుంటూరు 590, కడప 286, కృష్ణా 263, కర్నూలు 834, నెల్లూరు 423, ప్రకాశం 614, శ్రీకాకుళం 773, విశాఖపట్నం 512, విజయనగరం 388, వెస్ట్ ​గోదావరి 893 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్​వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.

ఏపీ హెల్త్​ బులెటిన్​