Breaking News

అర్హులందరికీ ‘డబుల్​’ ఇండ్లు

సారథి న్యూస్, కోడిమ్యాల : అర్హులైన పేద ప్రజలందరికీ డబుల్​ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సంకె రవిశంకర్​ పేర్కొన్నారు. కరీంనగర్​ జిల్లా కొడిమ్యాల మండలం లోని చెప్యాల గ్రామాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.