Breaking News

అర్వింద్​పై దాడి అమానుషం

సారథిన్యూస్, రామడుగు: బీజేపీ నేత నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​పై టీఆర్​ఎస్​ కార్యకర్తల దాడి అమానుషమని చొప్పదండి నియోజవర్గ బీజేపీ కన్వీనర్​ జిన్నారం విద్యాసాగర్​ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్​ఎస్​ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే నేతలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్​ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో నాయకులు పొన్నం శ్రీను, పోచంపల్లి నరేశ్​, కల్లెం శివ, వెంకటేశ్​, అజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.