Breaking News

అమరావతి.. శాసన రాజధానిగా కూడా వద్దు

అమరావతి: ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి శాసనరాజధానిగా వద్దంటూ ఆయన పేర్కొన్నారు. ‘పేదలకు అమరావతిలో ఇళ్లస్థలాలు కూడా ఇవ్వనివ్వకుండా ఇక్కడి రైతుల కోర్టుకెక్కి అండుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతిని శాసనరాజధానిగా కూడా పెట్టవద్దు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ విషయాన్ని నేను స్వయంగా సీఎం జగన్మోహన్​రెడ్డికి చెప్పాను’ సీఎం జగన్​ పేదలపక్షపాతిగా పనిచేస్తుంటే.. నీచుడైన చంద్రబాబు అడ్డుకుంటున్నాడని.. కోర్టులకు ఎక్కి అడ్డంకులు సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబును ఏదో ఒకరోజు ప్రజలు చెప్పుతో కడతారని వ్యాఖ్యానించారు.