Breaking News

అడుగు అడుగుకో మడుగు

సారథిన్యూస్, రామడుగు: మీరు చూస్తున్న ఈ ఫోటో ఎక్కడో మారుమూల గ్రామంలోనిది కాదు.. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఓ రోడ్డు. రామడుగు వరద కాల్వ నుంచి చిప్పకుర్తి పోయే రోడ్డు పూర్తిగా దెబ్బతిని కంకర తెలి గుంతలు పడి నీరు నిలిచింది. దీంతో వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. కాలి నడకన వెళ్లే వారుసైతం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు అద్వాన్నంగా మారడంతో రోగులు, గర్భిణి లు అవస్థలు పడుతున్నారు. గతంలో వరద కాల్వ నిర్మాణ పనుల సమయంలో టిప్పర్లు, లారీలు పోవటంతో తో ఇలా మారిందని దీన్ని పట్టించుకొనే నాథుడే కరువయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.