Breaking News

అచ్చన్నకు బెయిలొచ్చింది

సారథిన్యూస్​, అమరావతి: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు ఎట్టకేలకు బెయిల్​ దొరికింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది. రిమాండ్​లో ఉన్న అచ్చెన్నాయుడుకు కొంత కాలంగా కరోనా, ఇతర అరోగ్యసమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రమేష్ ఆస్పత్రి, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందించింది. ఈఎస్‌ఐ స్కాంలో రూ. 150 కోట్లు అవకతవకలు జరుగడంతో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 12న ఆయన అరెస్టయ్యారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.