Breaking News

హరితహారం.. మహాయజ్ఞం

సారథిన్యూస్/ చొప్పదండి/ హుస్నాబాద్: హరితహారం ఓ మహాయజ్ఞమని ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్​ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టలో ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మొక్కలను నాటడాన్ని తమవిధిగా భావించాలని పేర్కొన్నారు. అనంతరం జరిగిన ఓ కార్యక్రమంలో హుస్నాబాద్​ ఎమ్మెల్యే వొడితెల సతీశ్​కుమార్​ తమ నియోజవర్గానికి నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్​ను కోరారు. దీనికి కేటీఆర్​ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో మంత్రుల కొప్పుల ఈశ్వర్​, గంగుల కమలాకర్​, కలెక్టర్​ కే శశాంక, సీపీ కమలాసన్​రెడ్డి, గ్రంథాలయసంస్థ చైర్మన్​ ఏనుగు రవీందర్​రెడ్డి, మేయర్​ సునీల్​రావు, ఎంపీపీ చిలుక రవీందర్​, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ తదితరులు పాల్గొన్నారు.