![సెంచరీ కొట్టిన ప్లాస్మాదాతలు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/PLASMA-DONER-2.jpg?fit=677%2C339&ssl=1)
సారథి న్యూస్, కర్నూలు: కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోందని, ఇందుకు ప్లాస్మాదాత సహకారం ఎంతో ఉందని సెట్కూరు సీఈవో నాగరాజు నాయుడు అన్నారు. వైరస్ బారినపడి కోలుకున్న వారికి అవగాహన కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం సక్సెస్ అయ్యారని, ప్లాస్మాదాతల సంఖ్య రోజురోజుకు పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్లాస్మాదానంతో ఎందరో ప్రాణాలను కాపాడిన వారవుతారని, ధైర్యంగా ముందుకు రావాలని కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ రవిపట్టాన్ శెట్టి ఇచ్చిన పిలుపుతో దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని అన్నారు. కర్నూలు సర్వజన వైద్యశాలలోని బ్లడ్ బ్యాంకులో వందమంది ప్లాస్మాదానం చేశారని తెలిపారు.