![కల్నల్ సంతోష్బాబు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి జగదీశ్రెడ్డి తదితరులు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/SURYAPET.jpg?fit=1275%2C698&ssl=1)
సారథిన్యూస్, సూర్యాపేట: భారత్-చైనా సరిహద్దులో మాతృభూమి కోసం ప్రాణలర్పించిన సంతోష్బాబుకు యావత్ భారతావని కన్నీటి వీడ్కోలు పలికింది. సూర్యాపేట సమీపంలోని కేసారంలో సైనికలాంచనాల నడుమ సంతోష్బాబుకు అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. ఆర్మీ జవాన్లు వీరజవానుకు నివాళిగా మూడుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. తండ్రి సురేశ్బాబు చితికి నిప్పంటించారు. రాష్ట్ర మంత్రి జగదీశ్రెడ్డి సంతోష్బాబు పార్థివదేహం వద్ద నివాళి అర్పించారు.