Breaking News

వైద్య సిబ్బందికి కరోనా టెస్టులు

సారథిన్యూస్​ ములుగు: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ములుగు జిల్లాలోని వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య ములుగు జిల్లా ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న 25 మంది వైద్య సిబ్బంది శాంపిల్స్​ సేకరించారు. శాంపిళ్లను పరీక్షల కోసం వరంగల్​లోని కాకతీయ మెడికల్ ల్యాబ్ కు పంపామని చెప్పారు.