![వెహికిల్ ఓనర్షిప్పై కచ్చితమైన విధానం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/car-2f.jpg?fit=650%2C421&ssl=1)
హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు తెచ్చే విషయంపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇందుకు సంబంధించి తాజా సమాచారం ప్రకారం వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఫారం-20 నిబంధనల్లో సవరణలు చేయడం ద్వారా ఓనర్షిప్నకు సంబంధించి కచ్చితమైన విధానం అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లోని ఫారం-20లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సలహాలు సూచనలు అందజేయాలని సంబంధిత శాఖలను కోరుతూ ఆగస్టు 18న నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు తెలుస్తోంది. వాహనాలకు సంబంధించి ఓనర్షిప్ కచ్చితంగా తెలుసుకునేందుకు వీలుగా ఈ ఫారం– 20లో అవసరమైన మార్పులు చేయనున్నట్లు కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ పేర్కొంది.