![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/CPIIIIIFF.jpg?fit=729%2C326&ssl=1)
సారథి న్యూస్, రామడుగు: వర్షంతో నష్టపోయిన రైతన్నలు వెంటనే ఆదుకోవాలని సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పర్యటించి పంటలను పరిశీలించారు. వర్షాలతో రైతులు ఎంతో నష్టపోయారని పేర్కొన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు గంటే రాజేశం, మచ్చ రమేశ్, బాల్ రెడ్డి, నాగి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.