![సింగరేణి లాక్డౌన్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/singareni-GGH.jpg?fit=833%2C504&ssl=1)
సారథిన్యూస్, గోదావరిఖని: సింగరేణిలో లాక్డౌన్ ప్రకటించి కార్మికుల ప్రాణాలు కాపాడాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్, సీఐటీయూ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణిలో కరోనా వైరస్ లక్షణాలతో కార్మికులు చనిపోతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు విధులు నిర్వర్తించడానికి ఎంతో భయపడతున్నారని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వై గట్టయ్య, సీఐటీయూ రామగుండం రీజియన్ నాయకుడు ఉల్లి మొగిలి, ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి బీ జనక్ ప్రసాద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, బీఎంఎస్ అధ్యక్షుడు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.