![రేణిగుంట విమానాశ్రయంలో తప్పిన ప్రమాదం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/tpt.jpeg?fit=1024%2C768&ssl=1)
తిరుపతి: తిరుపతి రేణిగుంట విమానాశ్రయం రన్ వేపై తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం విమానం ల్యాండింగ్కు ముందు రన్ వే పరిశీలనకు వెళ్లిన ఫైర్ ఇంజిన్ వెహికిల్ బోల్తాపడింది. బెంగళూరు – తిరుపతి విమానం పైలట్ ఈ ప్రమాదాన్ని ముందుగా గుర్తించారు. విమానం రన్ వేపై ల్యాండ్ కాకుండానే బెంగళూరుకు తిరుగు పయనమైంది. హుటాహుటిన అక్కడి చేరుకున్న ఎయిర్పోర్టు అధికారులు, సిబ్బంది ఫైర్ ఇంజిన్ వాహనాన్ని తొలగించారు. దీంతో స్థానిక రేణిగుంట విమానాశ్రయంలో పలు ఫ్లైట్లు ల్యాండ్ కాకుండా వెనక్కి వెళ్తున్నాయి.