సారథి న్యూస్, రామాయంపేట: మూడు దశాబ్ధాలుగా లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్, మానవతా సంస్థల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న రామాయంపేటకు చెందిన ఏలేటి రాజశేఖర్రెడ్డికి న్యాయ శాస్త్రం లో డాక్టరేట్ లభించింది. సామాజిక శాస్త్రంలో, న్యాయశాస్త్రంలో పట్టబద్రుడైన ఆయన హైదరాబాద్లోని కేవీ రంగారెడ్డి కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జైపాల్రెడ్డి, రాజస్థాన్లోని జగదీశ్ ప్రసాద్ జబర్ మెన్ టెబ్రివాల యూనివర్సిటీ (జేజేటీయూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయమాల పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆన్ ఎన్విరాన్మెంటల్ లాస్ విత్ రిఫరెన్స్ టు ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఇండియా’ అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. ఈ మేరకు జేజేటీయూ యూనివర్సిటీ ప్రసిడెంట్ బాల్కిషన్ టబ్రివాల, రిజిస్ట్రార్ మధుగుప్తాలు తనకు న్యాయశాస్ర్తంలో డాక్టరేట్ ప్రధానం చేసినట్టు రాజశేఖర్ రెడ్డి వివరించారు. ఆయనకు డాక్టరేట్ లభించడం పట్ల కాకతీయ యూనివర్సిటీ మాజీ డీన్ కేవీ రంగారావు, మెదక్ మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి, రెడ్క్రాస్ సొసైటీ తెలంగాణ చైర్మన్ దేశాయ్ ప్రకాశ్రెడ్డి, జనరల్ సెక్రటరీ మధుమోహన్ హర్షం వక్తం చేశారు.
- August 18, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- KARIMNAGAR
- LIONSCLUB
- RAMAYAMPET
- REDCROSS
- రాజశేఖర్రెడ్డి
- రెడ్క్రాస్
- లయన్స్క్లబ్
- Comments Off on రాజశేఖర్రెడ్డికి డాక్టరేట్