Breaking News

మోదీపాలన.. జనరంజకం

సారథిన్యూస్​, రంగారెడ్డి: కేంద్రంలో నరేంద్రమోదీ పాలన జనరంజకంగా కొనసాగుతున్నదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికీ మోదీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. నరేంద్రమోదీ పాలనను ప్రపంచవ్యాప్తంగా నేతలు ప్రశంసిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, బోసు పల్లి ప్రతాప్, తుల నరసింహ గౌడ్, బచ్చిగళ్ళ రమేశ్​, నోముల కార్తీక్, మల్లెల ప్రేమ్ సాయి, నల్లవెల్లి నిరంజన్ రెడ్డి, విశాల్ గౌడ్, నిట్టు శివ తదితరులు పాల్గొన్నారు.