సారథి న్యూస్, హుస్నాబాద్/ బిజినేపల్లి: మొక్కలే జీవకోటికి ప్రాణాధారమని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వెంకటేశ్వర దేవాలయం ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటిన చెట్లను పరిరక్షించాలని కోరారు. కాగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 5,7,17 వ వార్డుల్లో మున్సిపల్ చైర్పర్యన్ ఆకుల రజిత మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో హుస్నాబాద్ వైస్ చైర్మన్ అనిత, కౌన్సిలర్లు పద్మ, రాజయ్య, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, వట్టెం ఆలయ ధర్మకర్త సందడి రంగారెడ్డి, జెడ్పీటీసీ హరిచరణ్ రెడ్డి , డీసీబీసీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బాలరాజ్ గౌడ్, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి, టీఆర్ఎస్ నేతలు కిరణ్, సర్పంచ్ అమృత్ రెడ్డి, ఎంపీటీసీలు తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- June 29, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- HARITHAHARAM
- MARRI
- MLA
- NAGARKURNOOL
- PLANTS
- చెట్లు
- మర్రి జనార్దన్రెడ్డి
- Comments Off on మొక్కలే జీవకోటికి ప్రాణాధారం