Breaking News

మొక్కలే జీవకోటికి ప్రాణాధారం

సారథి న్యూస్, హుస్నాబాద్/ బిజినేపల్లి: మొక్కలే జీవకోటికి ప్రాణాధారమని నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వెంకటేశ్వర దేవాలయం ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటిన చెట్లను పరిరక్షించాలని కోరారు. కాగా కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​ పట్టణంలోని 5,7,17 వ వార్డుల్లో మున్సిపల్​ చైర్​పర్యన్​ ఆకుల రజిత మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో హుస్నాబాద్​ వైస్ చైర్మన్ అనిత, కౌన్సిలర్లు పద్మ, రాజయ్య, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, వట్టెం ఆలయ ధర్మకర్త సందడి రంగారెడ్డి, జెడ్పీటీసీ హరిచరణ్ రెడ్డి , డీసీబీసీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, పీఏసీఎస్​ చైర్మన్ బాలరాజ్​ గౌడ్, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి, టీఆర్​ఎస్​ నేతలు కిరణ్, సర్పంచ్ అమృత్ రెడ్డి, ఎంపీటీసీలు తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.