![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/CHAIR-PERSONNFF.jpg?fit=700%2C436&ssl=1)
సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా కొండా సుగుణ నియమితులయ్యారు. శుక్రవారం ఆమె దేవరకద్రలోని శ్రీనివాస గార్డెన్ ఫంక్షన్హాల్లో ప్రమాణం చేయనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు వి.శ్రీనివాస్గౌడ్, ఎస్.నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.